సెమీస్‌లో యూకీ ఓటమి | yuki bhambri lossed tennis tournment | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో యూకీ ఓటమి

Mar 12 2017 12:02 AM | Updated on Sep 5 2017 5:49 AM

జుహై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్‌ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది.

న్యూఢిల్లీ: జుహై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్‌ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో యూకీ 3–6, 5–7తో టాప్‌ సీడ్‌ ఎవగెని డాన్‌స్కాయ్‌ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement