యూత్ చెస్ టోర్నీఆరంభం | Youth chess tournament in the beginning of the | Sakshi
Sakshi News home page

యూత్ చెస్ టోర్నీఆరంభం

Oct 5 2014 2:08 AM | Updated on Sep 2 2017 2:20 PM

యూత్ చెస్ టోర్నీఆరంభం

యూత్ చెస్ టోర్నీఆరంభం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యూత్ చెస్ టోర్నమెంట్ శనివారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఆరంభమైంది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యూత్ చెస్ టోర్నమెంట్ శనివారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఆరంభమైంది. రాష్ట్ర చెస్ అడ్‌హాక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అధికారిక టోర్నమెంట్ రెండు రోజుల పాటు జరుగుతుంది. కమిటీ చైర్మన్, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహారెడ్డి పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నీలో తెలంగాణలోని 10 జిల్లాలకు చెందిన 56 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వీరిలో 11 మంది ఇంటర్నేషనల్ ‘ఫిడే’ రేటింగ్ ఆటగాళ్లు ఉన్నారు. టోర్నమెంట్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement