దివిజ్ శరణ్–సితాక్ జంట శుభారంభం
పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్ (భారత్)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పారిస్లో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్–సితాక్ ద్వయం 6–4, 6–3తో ఫెలిసియానో లోపెజ్–మార్క్ లోపెజ్ (స్పెయిన్) జోడీపై విజయం సాధించింది.
67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో దివిజ్ జంట ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. రెండో రౌండ్లో మైక్ బ్రయాన్–జాక్ సోక్ (అమెరికా) ద్వయంతో దివిజ్–సితాక్ జోడీ తలపడుతుంది.
మరిన్ని వార్తలు