దివిజ్‌ శరణ్‌–సితాక్‌ జంట శుభారంభం  | Winning start for Sharan-Sitak | Sakshi
Sakshi News home page

దివిజ్‌ శరణ్‌–సితాక్‌ జంట శుభారంభం 

Oct 31 2018 1:52 AM | Updated on Oct 31 2018 1:52 AM

Winning start for Sharan-Sitak - Sakshi

పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–ఆర్తెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) జంట రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. పారిస్‌లో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో దివిజ్‌–సితాక్‌ ద్వయం 6–4, 6–3తో ఫెలిసియానో లోపెజ్‌–మార్క్‌ లోపెజ్‌ (స్పెయిన్‌) జోడీపై విజయం సాధించింది.

67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దివిజ్‌ జంట ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. రెండో రౌండ్‌లో మైక్‌ బ్రయాన్‌–జాక్‌ సోక్‌ (అమెరికా) ద్వయంతో దివిజ్‌–సితాక్‌ జోడీ తలపడుతుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement