రీసైకిల్ చేసిన నీటినే ఐపీఎల్‌కు వాడుకుంటాం | will use recycled water for ipl matches, mca tells court | Sakshi
Sakshi News home page

రీసైకిల్ చేసిన నీటినే ఐపీఎల్‌కు వాడుకుంటాం

Apr 12 2016 11:44 AM | Updated on Sep 3 2017 9:47 PM

రీసైకిల్ చేసిన నీటినే ఐపీఎల్‌కు వాడుకుంటాం

రీసైకిల్ చేసిన నీటినే ఐపీఎల్‌కు వాడుకుంటాం

ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో అడ్డు తొలగించుకునేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఓ సరికొత్త పరిష్కారాన్ని కనుగొంది.

ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో అడ్డు తొలగించుకునేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఓ సరికొత్త పరిష్కారాన్ని కనుగొంది. తాము ఆర్‌డబ్ల్యుఐటీసీ సరఫరా చేసే నీటినే మ్యాచ్‌లలో పిచ్ సిద్ధం చేయడానికి వాడుకుంటామని బాంబే హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు బాంబే హైకోర్టులో సమాధానం దాఖలు చేసింది. వాడిన నీటిని రీసైకిల్ చేసి, ఆ నీళ్లనే ఆర్‌డబ్ల్యుఐటీసీ సరఫరా చేస్తుంది. దానివల్ల తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఎంసీఏ చెప్పింది.

పిచ్‌లను సిద్ధం చేయడానికి వాళ్లు సరఫరా చేసే రీసైకిల్డ్ నీళ్లు సరిపోతాయని ఎంసీఏ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందువల్ల మంచినీటిని ఉపయోగించకుండానే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కాగా.. ముంబై, పుణె నగరాల్లో నిర్వహించే 17 మ్యాచ్‌లకు ఈ రీసైకిల్డ్ నీళ్లను ఉపయోగిస్తారు. మరోవైపు నాగపూర్‌లో నిర్వహించదలచిన మూడు మ్యాచ్‌లను మొహాలీకి తరలించేందుకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందని బీసీసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement