ధోనిసేనను ఓడించే సత్తావుంది: విండీస్ కోచ్ గిబ్సన్ | We can beat India: Windies coach gibson | Sakshi
Sakshi News home page

ధోనిసేనను ఓడించే సత్తావుంది: విండీస్ కోచ్ గిబ్సన్

Oct 21 2013 7:40 PM | Updated on Sep 1 2017 11:50 PM

ధోనిసేనను కంగుతినిపించే సత్తా తమ ఆటగాళ్లకు వుందని వెస్టిండీస్ కోచ్ ఒటిస్ గిబ్సన్ అన్నారు.

బ్రిడ్జ్‌టౌన్ : ధోనిసేనను కంగుతినిపించే సత్తా తమ ఆటగాళ్లకు వుందని వెస్టిండీస్ కోచ్ ఒటిస్ గిబ్సన్ అన్నారు. వచ్చే నెలలో విండీస్ జట్టు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుత జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారని... ఈ టూర్‌లో విండీస్ జట్టు రాణిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ సారి ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరుగుతుంది. గత పర్యటనలో అనుభవలేమి మాకు  ప్రతికూలించింది. కానీ ఇప్పుడు ఆ కొరత లేదు. తప్పకుండా చక్కని ప్రదర్శన కనబరుస్తాం’ అని గిబ్సన్ చెప్పారు. భారత పర్యటనలో వెస్టిండీస్ జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.

 

మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ అంతర్జాతీయ టెస్టులకు వీడ్కోలు పలుకుతున్న సిరీస్ ఇది. తొలి టెస్టు నవంబర్ 6 నుంచి 10 వరకు కోల్‌కతాలో జరగనుంది.   సచిన్ ఆడనున్న 200వ టెస్టు, సిరీస్‌లో రెండో టెస్టు 14 నుంచి 18 వరకు ముంబైలో జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement