లండన్ క్లాసిక్ టోర్నీ: మళ్లీ ఓడిన ఆనంద్ | Viswanathan Anand loses to Maxime Vachier-Lagrave | Sakshi
Sakshi News home page

లండన్ క్లాసిక్ టోర్నీ: మళ్లీ ఓడిన ఆనంద్

Dec 13 2015 1:04 AM | Updated on Sep 3 2017 1:53 PM

భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్‌లో తన నిరాశజనక ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.

లండన్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్‌లో తన నిరాశజనక ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 34 ఎత్తుల్లో ఓడిపోయాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆనంద్‌కిది మూడో పరాజయం కావడం గమనార్హం. ఏడో రౌండ్ తర్వాత ఆనంద్ 2.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. 4.5 పాయింట్లతో మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ అగ్రస్థానంలోకి వచ్చాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement