విశ్వనాథన్ ఆనంద్ ‘మైండ్మాస్టర్’ విడుదల

చెన్నై: భారత సూపర్ గ్రాండ్మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ రాసిన ‘మైండ్ మాస్టర్’ పుస్తకం శుక్రవారం విడుదలైంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘ది హిందు’ పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ లాంఛనంగా ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ‘మీరు చెస్ రొమాంటిక్ అయితే ఈ ఆట అందాన్ని ఆస్వాదిస్తారు. ఈ కంప్యూటర్ల యుగంలోనూ చెస్ ఆట అనుభూతే వేరు. కంప్యూటర్లు కూడా అంతే అనంతమైన సాధ్యాల్ని సాకారం చేస్తాయి’ అని అన్నాడు. తన పుస్తకంలో చెస్ గడులతో పాటు కంప్యూటర్కూ చోటిచ్చానని దీంతో ఎలాంటి మార్పులు సంభవించాయో పేర్కొన్నట్లు చెప్పాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి