వెంక ట కృష్ణ అజేయ సెంచరీ | venkat krishna hits half century | Sakshi
Sakshi News home page

వెంక ట కృష్ణ అజేయ సెంచరీ

Mar 16 2014 12:03 AM | Updated on Sep 2 2017 4:45 AM

కాకతీయ జట్టు బ్యాట్స్‌మన్ సాయి వెంకట కృష్ణ (112 నాటౌట్) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో ఆ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో పీకేసీసీ జట్టుపై ఘనవిజయం సాధించింది.

కాకతీయ జట్టు విజయం  
 ఎ-డివిజన్ వన్డే లీగ్
 
 జింఖానా, న్యూస్‌లైన్: కాకతీయ జట్టు బ్యాట్స్‌మన్ సాయి వెంకట కృష్ణ (112 నాటౌట్) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో ఆ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో పీకేసీసీ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పీకేసీసీ 158 పరుగుల వద్ద ఆలౌటైంది. కుమార్ (81) అర్ధ సెంచరీతో రాణించాడు. కాకతీయ బౌలర్లు రాము, చందు చెరో 4 వికెట్లు పడగొట్టారు. తర్వాత బరిలోకి దిగిన కాకతీయ.. వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసింది.
 
 తుకారామ్ శతకం
 ఎ-ఇన్‌స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఏపీ హైకోర్టు బ్యాట్స్‌మన్ తుకారామ్ (115) సెంచరీతో విజృంభించాడు. దీంతో ఆ జట్టు ఐఐసీటీ జట్టుపై 22 పరుగుల తేడాతో గెలుపొందింది. శశిధర్ 30 పరుగులు చేశాడు. ఐఐసీటీ బౌలర్ సత్యం రెడ్డి 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఐఐసీటీ 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది.
 
 
  పరమేశ్ (109) సెంచరీతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో పోస్టల్ జట్టు 4 వికెట్ల తేడాతో హెచ్‌ఏఎల్ జట్టుపై నెగ్గింది. మొదట హెచ్‌ఏఎల్ 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. గణేశ్ (45 నాటౌట్), సందీప్ (35) మెరుగ్గా ఆడారు. పోస్టల్ బౌలర్ శివప్రసాద్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన పోస్టల్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. నిషాంత్ యాదవ్ (54) అర్ధ సెంచరీతో రాణించగా... వేణు గోపాల్ (30 నాటౌట్), విజయ్ కుమార్ (30) ఫర్వాలేదనిపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement