స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం! | SQUASH Dipika wins grudge tie, Ghosal too in semis to assure 2 medals | Sakshi
Sakshi News home page

స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం!

Sep 21 2014 7:57 PM | Updated on Sep 2 2017 1:44 PM

స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం!

స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం!

ఇప్పటిదాకా ఆసియా గేమ్స్‌లో మహిళలు స్క్వాష్‌ విభాగంలో వ్యక్తిగత పతకం సాధించలేదు.

ఇంచియాన్:ఇప్పటిదాకా ఆసియా గేమ్స్‌లో మహిళలు స్క్వాష్‌ విభాగంలో వ్యక్తిగత పతకం సాధించలేదు. ఈసారి ఆ లోటు తీరనుంది. తన పుట్టిన రోజు నాడు స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ మెరిసింది. సహచరురాలు జోష్న చినప్పతో జరిగిన సింగిల్స్ క్వార్టర్స్‌లో విజయం సాధించిన దీపిక తన ఖాతాలో కాంస్య పతకం ఖాయం చేసుకుంది. 1998 ఏషియాడ్‌లో ఈ క్రీడను ప్రవేశ పెట్టినప్పటినుంచి భారత సింగిల్స్ విభాగంలో క్రీడాకారిణులు పతకం అందుకోలేకపోయారు. అయితే హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో దీపిక 7-11, 11-9, 11-8, 15-17, 11-9 తేడాతో జోష్నను ఓడించి సెమీస్‌లో ప్రవేశించింది.

 

అటు పురుషుల సింగిల్స్‌లోనూ ఆసియా నంబర్ వన్ సౌరభ్ ఘోశల్ కూడా సెమీస్‌కు చేరి పతకంపై భరోసానిచ్చాడు.  భారత ఆటగాడు ఘోషల్ 11-6 9-11 11-2 11-9 పాకిస్తాన్ ఆటగాడు నజీర్ ఇక్బాల్ ను బోల్తా కొట్టించి పతకం ఖాయం చేసుకున్నాడు. దీంతో భారత్ తొలిసారిగా రెండు సింగిల్స్ విభాగాల్లో పతకాలు సాధించినట్లవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement