ఆచితూచి ఆడుతున్న సఫారీలు | Sakshi
Sakshi News home page

ఆచితూచి ఆడుతున్న సఫారీలు

Published Sat, Nov 14 2015 11:46 AM

South Africa 78/3 at lunch

బెంగళూరు: భారత్తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆచితూచి ఆడుతోంది. శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆరంభమైన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో లంచ్ విరామానికి 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.


భారత స్పిన్నర్ అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు షాకిచ్చాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సౌతాఫ్రికా ఓపెనర్ వాన్ జెల్ (10) వికెట్ల ముందు దొరికిపోయాడు. అశ్విన్ ఇదే ఓవర్లో డుప్లెసిస్ (0)ను పెవిలియన్ బాట పట్టించాడు. డుప్లెసిస్.. పుజారాకు క్యాచిచ్చి వెనుదిరిగాడు. కాసేపటి తర్వాత వరుణ్ ఆరోన్.. ఆమ్లా (7) ను బౌల్డ్ చేశాడు. ఎల్గర్ (38), డివిల్లీర్స్ (19) బ్యాటింగ్ చేస్తున్నారు.
 

Advertisement
Advertisement