రన్నరప్‌గా సాకేత్ జోడి | saketh stands runner up | Sakshi
Sakshi News home page

రన్నరప్‌గా సాకేత్ జోడి

Mar 22 2015 12:51 AM | Updated on Sep 2 2017 11:11 PM

రన్నరప్‌గా సాకేత్ జోడి

రన్నరప్‌గా సాకేత్ జోడి

చైనా ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ డబుల్స్‌లో ఏపీకి చెందిన సాకేత్ మైనేని జోడి రన్నరప్‌గా నిలిచింది.

చైనా ఏటీపీ చాలెంజర్ టోర్నీ
 షెన్‌జెన్ (చైనా): చైనా ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ డబుల్స్‌లో ఏపీకి చెందిన సాకేత్ మైనేని జోడి రన్నరప్‌గా నిలిచింది. సాకేత్, దివిజ్ శరణ్ జంట (భారత్) శనివారం జరిగిన ఫైనల్లో 1-6, 6-3, 2-10 తేడాతో నాలుగో సీడ్ గెరో క్రెట్‌షెమర్, అలెగ్జాండర్ సాట్శెకో (జర్మనీ) జంట చేతిలో పరాజయం పాలైంది. ఐదు ఏస్‌లు సంధించిన సాకేత్ జోడి ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తొలి సెట్‌లో పరాజయం పాలైన తర్వాత, మెరుగైన ప్రదర్శనతో రెండో సెట్‌ను గెల్చుకున్నా... నిర్ణాయక టైబ్రేక్‌లో భారత ద్వయం చేతులెత్తేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement