సాకేత్‌ పరాజయం  | Saket myneni loss the match | Sakshi
Sakshi News home page

సాకేత్‌ పరాజయం 

Apr 17 2019 1:09 AM | Updated on Apr 17 2019 1:09 AM

Saket myneni loss the match - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కున్‌మింగ్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు, భారత డేవిస్‌ కప్‌ జట్టు సభ్యుడు సాకేత్‌ మైనేని పోరాటం ముగిసింది. చైనాలోని ఆనింగ్‌ నగరంలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సాకేత్‌ 2–6, 4–6తో భారత్‌కే చెందిన రెండో సీడ్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ చేతిలో ఓడిపోయాడు. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు.

ప్రత్యర్థి సర్వీస్‌ను ఒక్కసారి కూడా బ్రేక్‌ చేయలేకపోయిన సాకేత్‌ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌ మరో రెండో రౌండ్‌ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) 6–4, 6–4తో యాన్‌ బాయ్‌ (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement