
సయ్యదా ఫలక్కు స్వర్ణం
ఇండో- శ్రీలంకన్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో సయ్యదా ఫలక్ స్వర్ణంతో మెరిసింది.
కరాటే చాంపియన్షిప్
సాక్షి, హైదరాబాద్: ఇండో- శ్రీలంకన్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో సయ్యదా ఫలక్ స్వర్ణంతో మెరిసింది. కర్నాటకలో జరిగిన ఈ చాంపియన్షిప్ ఫైనల్లో సయ్యదా 8-0తో కన్నన్గారా (శ్రీలంక)ను ఓడించి విజేతగా నిలిచింది. అంతకు ముందు జరిగిన సెమీస్లో కర్నాటకకు చెందిన మారియాపై గెలిచింది. ఈ మ్యాచ్లో ఫలక్ 2-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో గాయం కారణంగా మారియా పోటీ నుంచి తప్పుకుంది. ఈ టోర్నీ తొలిరౌండ్లో ఫలక్ 8-0తో దివ్య (కర్నాటక)పై విజయం సాధించింది.