breaking news
saeeda falak
-
ప్రపంచ కరాటే ఈవెంట్కు ఫలక్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన కరాటే క్రీడాకారిణి సయ్యదా ఫలక్ ప్రపంచ కరాటే సమాఖ్య (డబ్ల్యూకేఎఫ్) 1 సిరీస్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది. ఈ కరాటే పోటీలు ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు టర్కీలోని ఇస్తాంబుల్లో జరుగనున్నాయి. ఆమె మహిళల ప్లస్ 68 కేజీల సీనియర్ కుమిటే కేటగిరీలో బరిలోకి దిగనుంది. ఇందులో 86 దేశాలకు చెందిన 1,282 కరా టే క్రీడాకారులు 14 కేటగిరీల్లో తలపడతారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సయ్యదా ఫలక్ బుధవారం అక్కడికి బయలుదేరుతుంది. -
సయ్యదా ఫలక్కు స్వర్ణం
కరాటే చాంపియన్షిప్ సాక్షి, హైదరాబాద్: ఇండో- శ్రీలంకన్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో సయ్యదా ఫలక్ స్వర్ణంతో మెరిసింది. కర్నాటకలో జరిగిన ఈ చాంపియన్షిప్ ఫైనల్లో సయ్యదా 8-0తో కన్నన్గారా (శ్రీలంక)ను ఓడించి విజేతగా నిలిచింది. అంతకు ముందు జరిగిన సెమీస్లో కర్నాటకకు చెందిన మారియాపై గెలిచింది. ఈ మ్యాచ్లో ఫలక్ 2-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో గాయం కారణంగా మారియా పోటీ నుంచి తప్పుకుంది. ఈ టోర్నీ తొలిరౌండ్లో ఫలక్ 8-0తో దివ్య (కర్నాటక)పై విజయం సాధించింది.