ప్రాంజలకు మిశ్రమ ఫలితాలు

pranjala gets mixed results in ITF womens tourney - Sakshi

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సంఘం (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. షోలాపూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్‌ విభాగంలో సెమీస్‌కు చేరిన ప్రాంజల... సింగిల్స్‌ విభాగంలో ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్‌ ప్రాంజల 6–7 (3/7), 7–5, 2–6తో బున్వయి థాంచవత్‌ (థాయ్‌లాండ్‌ ) చేతిలో ఓడిపోయింది.

డబుల్స్‌ క్వార్టర్స్‌లో ప్రాంజల (భారత్‌)–చింగ్‌ వెన్‌ సు (చైనీస్‌ తైపీ) ద్వయం 6–1, 7–6 (7/4)తో జియాక్సిన్‌ కోంగ్‌–జియాకంగ్‌ (చైనా) జంటపై గెలుపొందింది. మరో క్వార్టర్స్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన సామ సాత్విక–షేక్‌ హుమేరా బేగం జంట 1–6, 5–7తో అలెగ్జాండ్రా గ్రించిషినా (కజకిస్తాన్‌)–అల్బినా ఖబిబులినా (ఉజ్బెకిస్తాన్‌) జోడీ చేతిలో ఓటమి పాలైంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top