ఫైనల్లో ప్రజ్నేశ్‌  | prajnesh gunneswaran reach the final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ప్రజ్నేశ్‌ 

Apr 21 2019 1:16 AM | Updated on Apr 21 2019 1:16 AM

prajnesh gunneswaran reach the final - Sakshi

న్యూఢిల్లీ: భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ ఈ ఏడాది తొలిసారి ఏటీపీ చాలెంజర్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. చైనాలో జరుగుతున్న కున్‌మింగ్‌ ఓపెన్‌లో ఈ చెన్నై ఆటగాడు పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

శనివారం జరిగిన సెమీఫైనల్లో రెండో సీడ్‌ ప్రజ్నేశ్‌ 7–6 (7/5), 6–7 (3/7), 6–4తో మూడో సీడ్‌ కామిల్‌ మజార్జక్‌ (పోలాండ్‌)పై విజయం సాధించాడు. 2 గంటల 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 80వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. ఈ ఏడాది మూడు ఏటీపీ చాలెంజర్‌ టోర్నీల్లో పాల్గొన్న ప్రజ్నేశ్‌ రెండింటిలో సెమీస్‌ చేరుకోగా... మరో టోర్నీలో రెండో రౌండ్‌లో ఓడిపోయాడు. నేడు జరిగే ఫైనల్లో 14వ సీడ్‌ జే క్లార్క్‌ (బ్రిటన్‌)తో ప్రజ్నేశ్‌ ఆడతాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement