విలియమ్సన్‌ అరుదైన ఘనత | Kane Williamson fourth successive half century in ipl 2018 | Sakshi
Sakshi News home page

విలియమ్సన్‌ అరుదైన ఘనత

May 13 2018 5:37 PM | Updated on May 13 2018 5:38 PM

Kane Williamson fourth successive half century in ipl 2018 - Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అరుదైన ఘనత సాధించాడు. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో  విలియమ్సన్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. దాంతో ఈ సీజన్‌లో వరుసగా నాల్గో హాఫ్‌ సెంచరీ విలియమ్సన్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ప‍్రస్తుత ఐపీఎల్‌లో వరుసగా నాలుగు హాఫ్‌ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో జోస్‌ బట్లర్‌(రాజస్తాన్‌ రాయల్స్‌)కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఐపీఎల్‌లో విలియమ‍్సన్‌కు ఏడో హాఫ్‌ సెంచరీ కాగా, ఓవరాల్‌గా 10వ ఐపీఎల్‌ అర్థ శతకం.


టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌(2) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో శిఖర్‌ ధావన్‌తో కలిసి కేన్‌ విలియమ‍్సన్‌ ఇన్నింగ్స్‌ నిర్మించాడు.  వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ క్రమంలోనే ముందుగా ధావన్‌ హాఫ్‌ సెంచరీ సాధించగా, ఆపై విలియమ్సన్‌ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే జట్టు స్కోరు 141 పరుగుల వద్ద ఉండగా ధావన్‌(79;49 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), విలియమ్సన్‌(51; 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు వరుసగా పెవిలియన్‌ చేరారు. ముందుగా డ్వేన్‌ బ్రేవో వేసిన16 ఓవర్‌ చివరి బంతికి ధావన్‌ ఔట్‌ కాగా, ఆపై శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 17 ఓవర్‌ తొలి బంతికి విలియమ్సన్‌ పెవిలియన్‌ చేరాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement