జలజ్‌ శతకం: కేరళ 227/1 | Jalaj Saxena century at the end of the second day of the Ranji Trophy | Sakshi
Sakshi News home page

జలజ్‌ శతకం: కేరళ 227/1

Nov 14 2018 2:49 AM | Updated on Nov 14 2018 2:49 AM

Jalaj Saxena  century at the end of the second day of the Ranji Trophy  - Sakshi

తిరువనంతపురం: ఆంధ్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కేరళ భారీ ఆధిక్యానికి బాటలు పర్చుకుంది. మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 227 పరుగులు చేసింది. జలజ్‌ సక్సేనా (127 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా, అరుణ్‌ కార్తీక్‌ (56) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 139 పరుగులు జోడించారు. ప్రస్తుతం జలజ్‌తో పాటు రోహన్‌ ప్రేమ్‌ (34 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు ఆంధ్ర జట్టు మరో 29 పరుగులు జత చేసి తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులకు ఆలౌటైంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement