ఇంగ్లండ్ పయనమైన భారత క్రికెట్ జట్టు


ముంబై: భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు పయనమైంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని 19 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఆదివారమిక్కడ నుంచి బయల్దేరింది. ఇంగ్లండ్లో టీమిండియా 5 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ-20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 26 నుంచి జరిగే మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్తో భారత పర్యటన ఆరంభమవుతుంది.



షెడ్యూల్:



టెస్టు సిరీస్



మొదటి టెస్ట్- జూలై 9 నుంచి

రెండో టెస్ట్- జూలై 17 నుంచి

మూడో టెస్ట్- జూలై 27 నుంచి

నాలుగో టెస్ట్- ఆగస్ట్‌ 7 నుంచి

ఐదో టెస్ట్‌ ఆగస్టు 15 నుంచి



వన్డే సిరీస్

 

మొదటి వన్డే ఆగస్టు 25న

రెండో వన్డే ఆగస్టు 27న

మూడో వన్డే - ఆగస్టు 30న

నాలుగో వన్డే సెప్టెంబర్‌ 2న

ఐదో వన్డే సెప్టెంబర్ 5న



ఏకైక టీ-20



సెప్టెంబరు 7న

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top