భారత్‌కు మూడో స్థానం | India Third position | Sakshi
Sakshi News home page

భారత్‌కు మూడో స్థానం

Jul 27 2015 1:01 AM | Updated on Sep 3 2017 6:13 AM

వోల్వో అంతర్జాతీయ అండర్-21 హాకీ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్‌తో

 బ్రెడా (నెదర్లాండ్స్): వోల్వో అంతర్జాతీయ అండర్-21 హాకీ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం తేలేందుకు షూటౌట్ అనివార్యమైంది. ఈ షూటౌట్‌లో ఇంగ్లండ్ క్రీడాకారిణులు ఐదు ప్రయత్నాలను భారత గోల్‌కీపర్ ఇందర్‌ప్రీత్ కౌర్ అడ్డుకోవడం విశేషం. మరోవైపు భారత్ నుంచి దీప్ గ్రేస్ ఎక్కా కీలకమైన గోల్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement