బోర్డు ప్రెసిడెంట్స్‌ జట్టులో విహారి  | Hanuma vihari in Board President team | Sakshi
Sakshi News home page

బోర్డు ప్రెసిడెంట్స్‌ జట్టులో విహారి 

Sep 22 2018 1:12 AM | Updated on Mar 10 2019 8:23 PM

Hanuma vihari in Board President team - Sakshi

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో ఈనెల 29, 30 తేదీల్లో జరిగే వార్మప్‌ మ్యాచ్‌లో పాల్గొనే బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టును ప్రకటించారు. కరుణ్‌ నాయర్‌ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్‌ రంజీ జట్టు కెప్టెన్, ఇటీవలే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన హనుమ విహారికి స్థానం లభించింది. ఈ వార్మప్‌ మ్యాచ్‌ తర్వాత భారత్‌తో విండీస్‌ రెండు టెస్టులు ఆడుతుంది. తొలి టెస్టు అక్టోబరు 4 నుంచి 8 వరకు రాజ్‌కోట్‌లో... రెండో టెస్టు అక్టోబరు 12 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరుగుతాయి.

బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌: కరుణ్‌ నాయర్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, మయాంక్, విహారి, శ్రేయస్‌ అయ్యర్, అంకిత్‌ బావ్నే, ఇషాన్‌ కిషన్, జలజ్‌ సక్సేనా, సౌరభ్, బాసిల్‌ థంపి, అవేశ్‌ ఖాన్, విఘ్నేశ్, ఇషాన్‌ పోరెల్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement