
క్యారమ్లో భారత్కు స్వర్ణం
ప్రపంచ క్యారమ్ చాంపియన్షిప్లో భారత్కు పసిడి పతకం లభించింది.
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ క్యారమ్ చాంపియన్షిప్లో భారత్కు పసిడి పతకం లభించింది. బర్మింగ్హమ్ (గ్రేట్ బ్రిటన్)లో జరుగుతోన్న ఈ పోటీల్లో హైదరాబాద్ క్రీడాకారిణి ఎస్. అపూర్వ (ఎల్ఐసీ) భారత్కు డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని అందించింది. మహిళల డబుల్స్ ఫైనల్లో అపూర్వ - కాజల్ కుమారి (భారత్) జంట 25-14, 25-16తో భారత్కే చెందిన పరిమళా దేవి- టుబా స్నేహర్ జోడీపై గెలుపొంది విజేతగా నిలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో అపూర్వ- కాజల్ జంట 25-1, 25-7తో యశిక- అరోషా (శ్రీలంక) జోడీపై విజయం సాధించింది. కాగా 2004 కొలంబోలో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్లో అపూర్వ విజేతగా నిలిచింది.