కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు | fight between kabaddi players, | Sakshi
Sakshi News home page

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు

Sep 11 2017 12:23 PM | Updated on Oct 2 2018 6:46 PM

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు - Sakshi

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు

ఒక్కోసారి ఆటలు మనుషుల ప్రాణాల మీదకు తెస్తాయి.

సాక్షి, న్యూఢిల్లీ: ఒక్కోసారి ఆటలు మనుషుల ప్రాణాల మీదకు తెస్తాయి. చిన్న గొడవలు కాస్తా చినికి చినికి గాలివానలా మారుతాయి. చివరికి నిండు ప్రాణాన్ని తీస్తాయి. దేశ రాజధానిలో జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో స్కోర్‌ విషయంలో ఇరు జట్ల మధ్య జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణల మీదకు తెచ్చింది. 

వివరాల్లోకి వెళ్తే దక్షిణ ఢిల్లీలోని దక్షిణ్‌పురి ప్రాంతంలో ఆదివారం రాత్రి కబడ్డీ మ్యాచ్‌ జరుగుతుండగా.. ఇరు జట్ల మధ్య స్కోర్‌ విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అవినాష్‌ (18) అనే యువకుడిపై ప్రత్యర్థి జట్టుకు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అవినాష్‌ తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. వెంటనే బాధితుడిని సమీపంలోని బాత్ర ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement