కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు | Sakshi
Sakshi News home page

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు

Published Mon, Sep 11 2017 12:23 PM

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఒక్కోసారి ఆటలు మనుషుల ప్రాణాల మీదకు తెస్తాయి. చిన్న గొడవలు కాస్తా చినికి చినికి గాలివానలా మారుతాయి. చివరికి నిండు ప్రాణాన్ని తీస్తాయి. దేశ రాజధానిలో జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో స్కోర్‌ విషయంలో ఇరు జట్ల మధ్య జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణల మీదకు తెచ్చింది. 

వివరాల్లోకి వెళ్తే దక్షిణ ఢిల్లీలోని దక్షిణ్‌పురి ప్రాంతంలో ఆదివారం రాత్రి కబడ్డీ మ్యాచ్‌ జరుగుతుండగా.. ఇరు జట్ల మధ్య స్కోర్‌ విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అవినాష్‌ (18) అనే యువకుడిపై ప్రత్యర్థి జట్టుకు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అవినాష్‌ తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. వెంటనే బాధితుడిని సమీపంలోని బాత్ర ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement