క్వార్టర్స్‌లో దివిజ్‌ శరణ్‌ జంట

Divij Sharan Pair enter Quarters - Sakshi

న్యూఢిల్లీ: అమెరికాలో జరుగుతున్న సిటీ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీలో దివిజ్‌ శరణ్‌ (భారత్‌) జంట క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో దివిజ్‌ శరణ్‌–ఆర్టెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) జంట 7–6 (7/2), 3–6, 10–7తో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–సెరెటాని (అమెరికా) జోడీపై ‘సూపర్‌ టైబ్రేక్‌’లో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం జరుగనున్న క్వార్టర్స్‌లో దివిజ్‌–సితాక్‌ జంట జేమీ ముర్రే, (ఇంగ్లండ్‌)–బ్రూనో సోరెస్‌ (బ్రెజిల్‌) ద్వయంతో తలపడనుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top