చెన్నై ఓపెన్‌ ఫైనల్లో దివిజ్‌–పురవ్‌ జోడీ | Chennai Open final pair of Divij-purav | Sakshi
Sakshi News home page

చెన్నై ఓపెన్‌ ఫైనల్లో దివిజ్‌–పురవ్‌ జోడీ

Jan 7 2017 12:00 AM | Updated on Sep 5 2017 12:35 AM

చెన్నై ఓపెన్‌ ఫైనల్లో దివిజ్‌–పురవ్‌ జోడీ

చెన్నై ఓపెన్‌ ఫైనల్లో దివిజ్‌–పురవ్‌ జోడీ

స్వదేశంలో తొలి ఏటీపీ డబుల్స్‌ టైటిల్‌ గెలిచేందుకు దివిజ్‌ శరణ్‌–పురవ్‌ రాజా (భారత్‌) జంట మరింత చేరువైంది.

చెన్నై: స్వదేశంలో తొలి ఏటీపీ డబుల్స్‌ టైటిల్‌ గెలిచేందుకు దివిజ్‌ శరణ్‌–పురవ్‌ రాజా (భారత్‌) జంట మరింత చేరువైంది. చెన్నై ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో ఈ జోడీ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో దివిజ్‌ శరణ్‌–పురవ్‌ రాజా ద్వయం 6–4, 6–2తో గిలెర్మె దురాన్‌–ఆండ్రీస్‌ మోల్తెని (అర్జెంటీనా) జంటపై విజయం సాధించింది.

గతంలో దివిజ్‌–పురవ్‌ బొగోటా ఓపెన్‌ (2013లో), లాస్‌ కబోస్‌ ఓపెన్‌ (2016లో) టోర్నీలలో విజేతగా నిలిచారు. శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో రోహన్‌ బోపన్న–జీవన్‌ (భారత్‌) జంట నికొలస్‌ మోన్‌రో (అమెరికా)–అర్తెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) జోడీతో ఆడుతుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement