'టీమిండియాను బలవంతం చేయలేం' | Can't force India to play bilateral series against Pakistan, says ICC | Sakshi
Sakshi News home page

'టీమిండియాను బలవంతం చేయలేం'

Sep 15 2017 11:22 AM | Updated on Sep 19 2017 4:36 PM

'టీమిండియాను బలవంతం చేయలేం'

'టీమిండియాను బలవంతం చేయలేం'

పాకిస్తాన్ క్రికెట్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు జరగడానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ల విషయంలో ఏమీ చేయలేమని స్పష్టం చేసింది.

దుబాయ్: పాకిస్తాన్ క్రికెట్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు జరగడానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ల విషయంలో ఏమీ చేయలేమని స్పష్టం చేసింది. భారత్-పాకిస్తాన్ క్రికెట్ జట్ల దైపాక్షిక సిరీస్ ల విషయంలో తమ జోక్యం నామమాత్రమేనని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ తెలిపారు.

'పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ విషయంలో టీమిండియాను బలవంతం చేయలేము. పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి భారత జట్టు ముందుకు రాకపోతే వారిని మేము హెచ్చరించలేము. దైపాక్షిక సిరీస్ ఒప్పందం అనేది ఇరు క్రికెట్ బోర్డులకు సంబంధించింది. ఆ నేపథ్యంలో భారత్ తో ద్వైపాకిక్ష సిరీస్ ల పై మేము ఏమీ మాట్లడలేము. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగడం లేదు. దీనిపై మా జోక్యం అంతంత మాత్రమే. కాకపోతే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అనవసర రాద్దాంతాన్ని సృష్టిస్తే మాత్రం మేము సహించం' అని డేవ్ రిచర్డ్సన్ హెచ్చరించారు.

భారత క్రికెట్ బోర్డును ఐసీసీకి అతి ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూరుతున్నప్పటికీ, తమ దృష్టిల్లో ఐసీసీ హోదా కల్గిన అన్ని క్రికెట్ బోర్డులు ఒకటేననే విషయం గ్రహించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement