టైటిల్ పోరుకు బోపన్న జంట | Bopanna ready for the challenge | Sakshi
Sakshi News home page

టైటిల్ పోరుకు బోపన్న జంట

Jun 14 2015 1:59 AM | Updated on Oct 2 2018 7:51 PM

టైటిల్ పోరుకు బోపన్న జంట - Sakshi

టైటిల్ పోరుకు బోపన్న జంట

మెర్సిడెస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం ఫైనల్లోకి అడుగుపెట్టింది.

 స్టుట్‌గార్ట్ (జర్మనీ): మెర్సిడెస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం ఫైనల్లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న-మెర్జియా జంట 6-3, 6-7 (6/8), 10-7తో రెండో సీడ్ జిమోనిచ్ (సెర్బియా) -మట్కోవ్‌స్కీ (పోలండ్) జోడీపై సంచలన విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట 11 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. రెండో సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయినప్పటికీ... నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో బోపన్న ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement