క్వార్టర్స్‌లో బోపన్న జోడీ  | Bopanna pair in Quarter final | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో బోపన్న జోడీ 

Apr 20 2018 1:40 AM | Updated on Apr 20 2018 1:40 AM

Bopanna pair in Quarter final - Sakshi

క్లే కోర్టు సీజన్‌ తొలి మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌ మోంటెకార్లో ఓపెన్‌లో భారత డబుల్స్‌ నంబర్‌వన్‌ రోహన్‌ బోపన్న–రోజర్‌ వాసెలిన్‌ (నెదర్లాండ్స్‌) జంట క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మొనాకోలోని మోంటెకార్లోలో జరుగుతున్న ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ 3–6, 6–4, 11–9తో ఏడో సీడ్‌ జేమీ ముర్రే (బ్రిటన్‌)–బ్రూనో సోరెస్‌ (బ్రెజిల్‌)ద్వయంపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో జాన్‌ సెబాస్టియన్‌–రాబర్ట్‌ ఫరాతో బోపన్న జంట తలపడనుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement