భారత జట్టులో ముగ్గురు తెలంగాణ షట్లర్లు

BAI announces 23-member squad for BWF World Junior Championship - Sakshi

ప్రపంచ జూ. బ్యాడ్మింటన్‌ పోటీలకు టీమిండియా ప్రకటన

న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బృందాన్ని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ప్రకటించింది. బాలురు, బాలికల విభాగాల్లో కలిపి మొత్తం 23 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో ముగ్గురు తెలంగాణ షట్లర్లకు చోటు దక్కింది. బాలుర విభాగంలో ప్రణవ్‌ రావు గంధం, నవనీత్‌ బొక్కా, ఖదీర్‌ మొయినుద్దీన్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతున్నారు. బాలికల విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరూ ఎంపిక కాలేదు. ఆగస్టులో పంచకుల, బెంగళూరులలో జరిగిన ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో ప్రదర్శన, సాధించిన పాయింట్ల ఆధారంగా భారత జట్టును ఎంపిక చేశారు. సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 13 వరకు రష్యాలోని కజాన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top