సాక్షి, న్యూఢిల్లీ : అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. టోక్యో ఒలంపిక్స్, ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే క్రీడాకారులకు నెలకు 50 వేల రూపాయలను నెలసరి ఖర్చుల కింద చెల్లిస్తున్నట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ శుక్రవారం ప్రకటించారు. అభినవ్ బింద్రా నేతృత్వం వహిస్తున్న ఒలంపిక్ టాస్క్ఫోర్స్ కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులను సైతం ఆమోదించినట్లు ఆయన చెప్పారు.
టార్గెట్ ఒలంపిక్స్ స్కీమ్ కింద 152 మంది క్రీడాకారులను ఎలైట్ ప్యానెల్లో చేర్చినట్లు రాథోడ్ చెప్పారు. ఎలైట్ప్యానల్కు ఎంపికైన 152 మంది క్రీడాకారులకు ఈ అవకాశం వర్తిస్తుందని అన్నారు. ఈ నెలసరి ఖర్చుల మొత్తాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్లో కూడా పేర్కొన్నారు.
MYAS @IndiaSports announces Rs 50k/month pocket allowance for 152 elite athletes preparing for Tokyo/CWG/Asian Games. Athletes first,always!
— Rajyavardhan Rathore (@Ra_THORe) 15 September 2017
The allowance applies wef 1 Sep 2017 & is purely for pocket expenses of elite athletes.Committed to providing all resources to our champions
— Rajyavardhan Rathore (@Ra_THORe) 15 September 2017
అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు
Published Fri, Sep 15 2017 7:50 PM
Related news
-
‘టాలెంట్ హంట్’కు సిద్ధం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలు కీలక ఘట్టంలోకి ప్రవేశించాయి. గ్రామ/వార్డు సచివాలయం, మండలస్థాయి పోటీలను దిగ్విజయంగా ముగించుకుని నియోజకవర్గ స్థాయిలో సత్తా చాటేందుకు జట్లు ఉరకలేస్తున్నాయి. బుధవారం నుంచి 175 నియోజకవర్గ కేంద్రాల్లో పూర్తిస్థాయి ప్రొఫెషనల్ రీతిలో పోటీలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఏర్పాట్లు చేసింది. క్రిక్క్లబ్ యాప్, ‘ఆడుదాం ఆంధ్రా’ వెబ్సైట్ ద్వారా యూట్యూబ్ చానల్లో ప్రత్యక్ష వీక్షణం, ప్రత్యక్ష స్కోరును తిలకించేలా సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కామెంట్రీలను నిర్వహించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలిసితీసే ఉద్దేశంతో ప్రభుత్వం 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులకు 5 క్రీడాంశాల్లో మెగా టోరీ్నకి శ్రీకారం చుట్టింది. కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ (డబుల్స్)లో నియోజకవర్గ స్థాయి నుంచి నగదు బహుమతులను ప్రకటించింది. పోటీలను పక్కా ప్రొఫెషనల్ విధానంలో ఆయా క్రీడా ఫెడరేషన్ల నిబంధనల ప్రకారం నిర్వహించనుంది. టీ10 విధానంలో పూర్తిస్థాయి మ్యాచ్ బాల్తో క్రికెట్ పోటీలు, వాలీబాల్లో (25–25–15), బ్యాడ్మింటన్లో (21–21–21) బెస్ట్ ఆఫ్ త్రీ పాయింట్ల విధానాన్ని అమలు చేయనుంది. ఖోఖోలో 2 ఇన్నింగ్స్కు 9 నిమిషాలు, కబడ్డీ పురుషుల సెషన్కు 20 నిమిషాలు, మహిళలకు 15 నిమిషాలు చొప్పున సమయాన్ని కేటాయించింది. భోజన, వసతి సౌకర్యాలతో.. మండలస్థాయి పోటీల్లో విజేతలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసింది. వీరిని నియోజకవర్గ స్థాయి పోటీలకు పంపేందుకు అవసరమైన చోట రవాణా, భోజన, వసతులను పర్యవేక్షిస్తోంది. ఈ నెలాఖరులోగా షెడ్యూల్ ప్రకారం పోటీలను పూర్తిచేసే లక్ష్యంతో సిబ్బందిని సమాయత్తం చేస్తోంది. 27 నుంచి పూర్తిస్థాయిలో క్రికెట్ పోటీలు ఊపందుకునేలా కార్యాచరణ రూపొందించింది. మండలాలు, మునిసిపాలిటీలు కలిపి 753 యూనిట్ల నుంచి 75,000 మందికిపైగా క్రీడాకారులు నియోజకవర్గ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిభ వేట ప్రారంభం.. నియోజకవర్గ స్థాయి నుంచే ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)లకు చెందిన ప్రతినిధులు నియోజకవర్గాల్లోని పోటీలను పరిశీలించి ‘టాలెంట్ హంట్’ చేపట్టనున్నారు. ప్రో కబడ్డీ సంస్థ, ప్రైమ్ వాలీబాల్, ఏపీ ఖోఖో క్రీడా సంఘం, బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు, అంతర్జాతీయ క్రీడాకారుల బృందాలు యువతలోని ప్రతిభను గుర్తించి నివేదిక రూపొందించనున్నాయి. అసలు ఆట ఇప్పుడే మొదలైంది ఆంధ్రాను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడంలో భాగంగా ఆడుదాం ఆంధ్రా నిర్వహిస్తున్నాం. ఇది ఏటా కొనసాగిస్తాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా వెతికిపట్టుకుని ప్రపంచ వేదికలపై నిలబెట్టడమే సీఎం జగన్ లక్ష్యం. ఇకపై అన్నీ కీలక ఘట్టాలే. ఇప్పుడే అసలు ఆట మొదలైంది. క్రీడాకారులు ప్రతి దశలోనూ అద్భుత ప్రతిభ కనబర్చాలి. – ఆర్కే రోజా, క్రీడా శాఖ మంత్రి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లు అందజేశాం నియోజకవర్గ స్థాయి పోటీలకు సర్వం సిద్ధమైంది. ఎప్పటికప్పుడు జేసీలు, శాప్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్రీడాకారులకు భోజన వసతి సౌకర్యాలపై క్షేత్ర స్థాయిలో సిబ్బంది తగిన ఆదేశాలిచ్చాం. మండలస్థాయి విజేతలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లు అందించాం. పూర్తిగా ప్రొఫెషనల్స్ తరహాలో టోర్నీ జరగనుంది. – ధ్యాన్చంద్ర, శాప్ ఎండీ -
ఆనందం.. ఆకాశాన్నంటింది
సాక్షి నెట్వర్క్/అమరావతి: గ్రామాల్లో ‘ఆడుదాంఆంధ్రా’ క్రీడా సంబరం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. క్రీడా మైదానాల్లోకి యువత భారీ సంఖ్యలో దూసుకొస్తున్నారు. నాల్గవ రోజు శుక్రవారానికి 14,396 గ్రామ/వార్డు సచివాలయాల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. దాదాపు 96.61 శాతం సచివాలయాల్లో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతపురం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో 100 శాతం సచివాలయాల్లో పోటీలు మొదలయ్యాయి. ఒక్క రోజే 21,488 మ్యాచ్లకు షెడ్యూల్ చేస్తే 18,871 మ్యాచ్లను పూర్తి చేశారు. ఏలూరు, బాపట్ల, అనంతపురం, కృష్ణా, వైఎస్సార్, తూర్పుగోదావరి, అనకాపల్లి, చిత్తూరు, విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 92 శాతానికిపైగా మ్యాచ్ షెడ్యూల్ పూర్తయింది. మొత్తం .16లక్షల మంది వీక్షకులు హాజరవగా.. మొత్తంగా నాలుగు రోజుల్లో 28.60 లక్షల మంది ఆడుదాం ఆంధ్ర క్రీడలను వీక్షించారు. పల్నాడుకే వన్నె తెచ్చిన క్రీడలు పల్నాడు జిల్లా వ్యాప్తంగా యువత ఆటల పోటీలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పర్యవేక్షించారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో క్రికెట్ పోటీలను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 257 సచివాలయాల పరిధిలో 467 మైదానాల్లో పోటీలు జరిగాయి. ఇక్కడ 666 మ్యాచ్లకు గాను 664 మ్యాచ్లు నిర్వహించారు. 8,816 మంది క్రీడాకారులు పాల్గొనగా, 32,850 మంది ప్రేక్షకులు వీక్షించారు. క్రీడల నిర్వహణ పై కలెక్టర్ షణ్మోహన్ క్షేత్రస్థాయిలో సమీక్షించారు. తిరుపతి జిల్లాలో 392 సచివాలయాల పరిధిలోని మైదానాల్లో క్రీడలు నిర్వహించారు. 1261 మ్యాచ్లకు గాను 1260 మ్యాచ్లను నిర్వహించారు. కడపలో కదం తొక్కారు కడప జిల్లా వ్యాప్తంగా క్రీడా పోటీలు సంబరాన్ని తలపిస్తున్నాయి. పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కడపలో నిర్వహించిన పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీడీఓలు, ఫిజికల్ డైరెక్టర్లు టోర్నమెంట్ను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లాలో 500 సచివాలయాల పరిధిలో 690 మ్యాచ్లు నిర్వహించారు. స్థానిక ఇండోర్ స్టేడియంతో పాటు పాఠశాల్లో 70 మ్యాచ్లు జరిగాయి. విజయవాడలోని కానూరి వీఆర్ సిద్ధార్థ కళాశాలలో జరుగుతున్న పోటీల్లో క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. విజయవంతంగా ఆడుదాం ఆంధ్రా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆడుదాం.. ఆంధ్రా’ ఆటల పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని వెలుగులోకి తీసుకురావటానికి ఈ ఆటల పోటీలు దోహదపడుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది క్రీడాకారులు వారి పేర్లు నమోదు చేసుకొని క్రీడల్లో పాల్గొంటున్నారు. సచివాలయం స్థాయి నుంచి ఆటల పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా చక్కని అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రద్యుమ్న, రాష్ట్ర క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ -
ఉరకలేస్తున్న క్రీడోత్సాహం
సాక్షి నెట్వర్క్/అమరావతి: రాష్ట్రంలో క్రీడా సంబరం ఉరకలేస్తోంది. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ యువత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రోజైన గురువారం 8,319 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. 26 వేల మ్యాచ్లకు గాను 82 శాతం షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యధికంగా ఏలూరు (96.80 శాతం), బాపట్ల (92.13 శాతం), అనంతపురం (90 శాతం) మేర ప్రణాళిక ప్రకారం పోటీలు జరిగాయి. గుంటూరు, ఏలూరు, బాపట్లలో 99.15కుపైగా, అన్నమయ్య, తూర్పుగోదావరి, విజయనగరం, ఎన్టీఆర్, అనకాపల్లిలో 96 శాతానికిపైగా సచివాలయాల్లో పోటీలు ఊపందుకున్నాయి. 8,948 క్రీడా మైదానాల్లో క్రీడాకారులకు, వీక్షకులకు అవసరమైన వసతులను కల్పించారు. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు ప్రత్యేకంగా కామెంట్రీ బాక్స్లను ఏర్పాటు చేశారు. సుమారు 6.69 లక్షల మంది పోటీలను వీక్షించారు. విక్రమార్కులై చెలరేగారు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు నువ్వా–నేనా అన్నట్టుగా పోటీల్లో తలపడ్డారు. నగరిలోని బుగ్గ అగ్రహారంలో వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలను తిలకించేందుకు వీక్షకులు పోటెత్తారు. పోటీల పర్యవేక్షణకు చిత్తూరు కలెక్టరేట్లోని పూలే భవనంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు. చిత్తూరు మైదానాల్లో నిర్వహిస్తున్న పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ పరిశీలించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు, పుంగనూరు, జీడీ నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో పోటీలు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి మూడో రోజు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఒంటిమిట్టలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా 645 సచివాలయాల పరిధిలోను, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో పోటీలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని 672 సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఖోఖో, వాలీబాల్ క్రీడాంశాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు కొనసాగుతున్నాయి. సివంగులై తలపడుతున్న యువతులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. యువతులు సివంగులను తలపిస్తూ పోటీల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 535 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో నిర్వహించిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీల్లో దాదాపు 13 వేల మంది క్రీడాకారులు పాల్గొనగా, 3 రోజుల్లో 81,860 మ్యాచ్లను తిలకించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 625 సచివాలయాల స్థాయిలో 956 మ్యాచ్లు జరగాల్సి ఉండగా, 730 మ్యాచ్లు జరిగాయి. మొత్తంగా మూడు రోజుల్లో 3,280 మ్యాచ్లు జరిగాయి. సుమారు 33 వేల మంది కారులు పోటీల్లో పాల్గొన్నారు. బాలికలు, యువతులతోపాటు డ్వాక్రా సంఘాల మహిళలు సైతం పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆడుదాం ఆంధ్రా పోటీలు విజయవంతంగా సాగుతున్నాయి. విజయం కోసం హోరాహోరీ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో వివిధ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. యువత పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొంటున్నారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం, ప్రగతి పాఠశాల క్రీడామైదానంలో క్రికెట్ పోటీలను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న పరిశీలించారు. క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. దాచేపల్లి మండలంలోని గామాలపాడులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పోటీలను ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సందడి తెచ్చాయి. గురువారం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 260 సచివాలయాల్లో 707 మ్యాచ్లలో క్రీడాకారులు తలపడ్డారు. కృష్ణా జిల్లాలో 508 సచివాలయాల్లో 977 మ్యాచ్లలో క్రీడాకారులు పోటీ పడ్డారు. మండల స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా జెర్సీ (టీ.షర్ట్, టోపీ)లను జిల్లా క్రీడల అభివృద్ధి కార్యాలయాలకు సరఫరా చేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని 605 సచివాలయాలకు 68,970 జెర్సీలు, కృష్ణా జిల్లాలో 508 సచివాలయాలకు 57,912 జెర్సీలు వచ్చాయి. -
సంబరంలా.. ఆడుదాం ఆంధ్రా పోటీలు
సాక్షి, నెట్వర్క్: మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా పోటీలు తొలిరోజు అంబరాన్ని అంటే సంబరంతో మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరులోని నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు 15 వేల గ్రామ/వార్డు సచివాలయాలకు గాను 6,174 చోట్ల షెడ్యూల్ ప్రకారం పోటీలను నిర్వహించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఈ పోటీలను ప్రారంభించారు. తొలి రోజు ఐదు క్రీడాంశాల్లో కలిపి మొత్తం 33,722 పోటీలు జరిగాయి. సాంప్రదాయ క్రీడాంశాలైన యోగా, మారథాన్ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 26 జిల్లాల్లోనూ 5 లక్షలకుపైగా ప్రేక్షకులు నేరుగా ఆడుదాం ఆంధ్రా పోటీలను వీక్షించినట్టు సమాచారం. దాదాపు 50 శాతం జిల్లాల్లో 100 శాతం, మిగిలిన జిల్లా్లల్లో 99 శాతం వరకు జట్ల కూర్పు పూర్తయింది. జనవరి 9లోగా గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలను పూర్తి చేసేలా రోజూ ప్రణాళిక ప్రకారం అధికార యంత్రాంగం పని చేస్తోంది. తుది నివేదిక ప్రకారం ఆడుదాం ఆంధ్రాకు 37.23 లక్షల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. ఇందులో 23.48 లక్షల మంది పురుషులు, 13.75 లక్షల మంది మహిళలు ఉండటం విశేషం. వలంటీర్ల ద్వారా మాన్యువల్ స్కోరింగ్తో పాటు పారదర్శకత కోసం క్రిక్ క్లబ్ యాప్ ద్వారా ఆన్లైన్ స్కోర్లు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 1.50 లక్షల మంది శిక్షణ పొందిన వలంటీర్లకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడల స్కోరింగ్కు ప్రత్యేక లాగిన్లు అందించారు. సచివాలయ స్థాయి పోటీల్లో విజేతలకు అందించేందుకు వీలుగా టీషర్టులు, టోపీలను వేగంగా సరఫరా చేస్తున్నారు. 17.10 లక్షల జతలకు గాను 8 లక్షలకు పైగా ఇప్పటికే జిల్లాలకు చేరాయి. కోస్తా.. వెల్లివిరిసిన ఆనందం.. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా పోటీలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరంలో పోటీలను కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఎంపీ భరత్రామ్ ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 511 సచివాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లాలో ఆటల పోటీలకు 90 వేల మంది పురుషులు, 40 వేల మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,16,171 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేయించుకున్నారు. రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు హాజరై పోటీలకు శ్రీకారం చుట్టారు. భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు, భీమవరంలో కలెక్టర్లు వె.ప్రసన్న వెంకటేష్, పి.ప్రశాంతిలు ఆటల పోటీలను ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో 1.43 లక్షల మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 1.71 లక్షల మంది క్రీడల్లో పాల్గొనటానికి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏలూరు జిల్లాలో 5 ప్రధాన క్రీడలకు సంబంధించి 14,354 టీమ్లను సిద్ధం చేసి 7,198 మ్యాచ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కలెక్టర్ ఢిల్లీరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ తదితరులు పాల్గొని పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలో దాదాపు 1.17 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ విభాగాల్లో 11 వేలకు పైగా జట్లు ఆడనున్నాయి. కృష్ణా జిల్లాలో వివిధ క్రీడల్లో 1.12 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. పురుషుల్లో 7 వేల జట్లు, మహిళల్లో 4వేల జట్లు ఉన్నాయి. పోటీల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జాతీయ పతాకంతో 2 కిలోమీటర్ల మేర విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. 3,280 అడుగుల పొడవున రూపొందించిన జాతీయ జెండాతో క్రీడాకారులు గాంధీనగర్ నుంచి చీమకుర్తిలోని ప్రభుత్వ హైస్కూలు క్రీడా ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టారు. దర్శిలో జాతీయ పతాకంతో రెవెన్యూ కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు జరిగాయి. ఉత్తరాంధ్రలో ఉరిమిన ఉత్సాహం.. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా వివిధ క్రీడాంశాల్లో 11,500 జట్లు నమోదు చేసుకోగా.. 670 క్రీడా మైదానాలు సిద్ధం చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 976 సచివాలయాల పరిధిలో 485 మైదానాల్లో ఐదు క్రీడాంశాల్లో ఆటల పోటీలు జరిగాయి. మొత్తం 2.07 లక్షల మంది క్రీడాకారులు పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విజయనగరంలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. ఆటల పోటీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులైన కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ పతక విజేత మత్స్య సంతోషి, జాతీయ వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారిణి శ్రీలక్ష్మి, స్కేటింగ్ క్రీడాకారుడు సాయితేజలను ఘనంగా సత్కరించారు. విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెంలో జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లిలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ రవి పట్టాన్శెట్టి, ఎంపీ సత్యవతి పోటీలకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లావ్యాప్తంగా 14,098 టీములు, అందులో 1.31 లక్షల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. రాయలసీమ.. ఆటాడుకుందాం రా.. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలో 1,89,929 మంది, నంద్యాల జిల్లాలో 1.25 లక్షల మంది క్రీడాకారులు పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో 645, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో గ్రామ/వార్డు సచివాలయ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పోటీలకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో 515 క్రీడామైదానాల్లో పోటీలు జరిగాయి. తిరుపతి జిల్లాలో పలు సచివాలయాల పరిధిలో క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీలు సందడిగా ప్రారంభమయ్యాయి. అనంతపురం, రాయదుర్గం, శింగనమల, గుంతకల్లు, తాడిపత్రి, రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోనూ పోటీలు జరిగాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. -
ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ‘ఆడుదాం ఆంధ్ర’ మెగా టోర్నీ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనడానికి యువత పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు 30.50 లక్షల మంది క్రీడాకారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. మరో 1.36 లక్షల మందికి పైగా ప్రేక్షకులుగా నమోదయ్యారు. వీరిలో క్రీడల్లో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన వారి కోసం శాప్ ప్రత్యేకంగా ఎడిట్ ఆప్షన్ను తీసుకొస్తోంది. అలాగే యువత నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు రిజిస్ట్రేషన్ల గడువును ఆదివారం వరకు పొడిగించింది. ప్రత్యేక డ్రెస్.. డిజిటల్ స్కోరింగ్ ఈ టోర్నీని ప్రొఫెషనల్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో విజేతలకు ప్రభుత్వం స్పోర్ట్స్ టీ షర్టులను పంపిణీ చేయనుంది. దాదాపు ఒక్కో సచివాలయం పరిధిలో ఐదు క్రీడాంశాల్లో(క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్, కబడ్డీ, వాలీబాల్)గెలిచిన 114 మంది మహిళలు, పురుషులకు ‘ఆడుదాం ఆంధ్ర’ లోగోతో కూడిన టీషర్టులు అందించనుంది. తొలి దశలో 17.19 లక్షల టీషర్టులను అందజేయనుంది. అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన జిల్లా స్థాయి విజేతలకు స్పోర్ట్స్ డ్రెస్ కిట్లు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది. అలాగే సచివాలయాల పరిధిలో వలంటీర్ల సేవలను ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల కోసం ఉపయోగించుకోనున్నారు. జిల్లా కోచ్లు, పీఈటీలు, పీడీలతో పాటు వలంటీర్లకు అంపైరింగ్, డిజిటల్ స్కోరింగ్పై తొలి దశ శిక్షణ అందించారు. మరోసారి సాంకేతిక నిపుణులతో ప్రత్యేక యాప్లో స్కోరింగ్ నమోదుపై శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామ, వార్డు సచివాలయం, మండల స్థాయి వరకు ఆఫ్లైన్లో స్కోర్లు నమోదు చేసి వాటిని యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గస్థాయిలో క్రీడాకారులు, ప్రేక్షకులు తమ మొబైల్లోనే స్కోర్ చూసుకునే విధంగా పోటీల సమయంలోనే ఆన్లైన్లో స్కోరింగ్ నమోదు చేస్తారు. పది రోజుల పాటు వాయిదా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 9,060 క్రీడా మైదానాలను శాప్ అధికారులు గుర్తించారు. మైదానాల్లో గడ్డి తొలగించడంతో పాటు క్రీడలకు అనువుగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు. కానీ తుపాను కారణంగా పలు జిల్లాల్లోని మైదానాల్లోకి నీళ్లు చేరాయి. ప్రస్తుతం వాటిని తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. దీంతో 15వ తేదీన ప్రారంభం కావాల్సిన టోర్నీని పది రోజుల పాటు వాయిదా వేశారు. మరోవైపు.. రిజిస్ట్రేషన్లకు గడువును ఆదివారం(డిసెంబరు 17) వరకు పొడిగించారు.
Related News by category
-
శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
రైలు ఎక్కేటప్పుడు.. దిగెటప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. రైలు కదులుతుంటే పట్టాలు, ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కొని కొంత మంది ప్రాణాలు కోల్పోతే.. మరికొంత మంది అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్( ఆర్పీఎఫ్) పోలీసుల సాహసంతో ప్రాణాలు దక్కించుకున్నవారు ఉన్నారు. అటువంటి ఘటనే ఒకటి హరిద్వార్లో చోటుచేసుకుంది. ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రైలు కింది పడిన వ్యక్తిని సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళ్లితే... ఉత్తరాఖండ్ హరిద్వార్కు సమీపంలోని లక్సర్ రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడు ఆహారం కోసం రైలు దిగాడు. అతను దిగిన రైలు కదలటంతో పరుగుపెట్టి మరీ ఎక్కడానికి ప్రయిత్నించాడు. కానీ, రైలు వేగంగా ఉండటంతో ఒక్కసారిగా డోర్ వద్ద అదుపుతప్పి రైలు పట్టాలు, ప్లాట్ మధ్యలో పడిపోయాడు. అప్పటికే రైలు కదులుతోంది. ప్రయాణికుడు రైలు కింద పడినట్లు శబ్దంతో రావటంలో అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే వచ్చి.. ముందుగా ఆ ప్రయాణికుడి తలను ప్లాట్పైకి లాగింది. వెంటనే రైలును అత్యవసరంగా ఆపారు. తర్వాత ఆ ప్రయాణికుడిని ప్లాట్ఫామ్కి లాగారు. క్షణాలో చాకచక్యంగా స్పందించిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడారు. ప్రయాణికుడిని రక్షించి కానిస్టేబుల్ కే. సుమతి రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని కాపాడిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి.. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. #viralvideo At Haridwar's Laksar railway station a passenger carrying food items from the railway station boarded the Calcutta-Jammutvi Express During this, his foot slipped and he got stuck between the train and the platform Woman constable Uma pulled him out safely#Uttarakhand pic.twitter.com/BvfnMqlPtQ— Siraj Noorani (@sirajnoorani) April 28, 2024 -
కేంద్ర వ్యవసాయ మంత్రిగా మాజీ సీఎం? ప్రధాని మోదీ లేఖలో స్పష్టం?
గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా, శివరాజ్సింగ్ చౌహాన్ను బీజేపీ తిరిగి ముఖ్యమంత్రిని చేయలేదు. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవల శివరాజ్సింగ్ చౌహాన్కు ప్రధాని మోదీ రాసిన లేఖ ఇటువంటి వార్తలకు కారణంగా నిలుస్తోంది. ‘దేశంలోని వ్యవసాయరంగంలో మీరు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రధాని మోదీ.. శివరాజ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయని కూడా మోదీ ఆ లేఖలో శివరాజ్ను ప్రశంసించారు.ప్రధాని మోదీ మాజీ సీఎం శివరాజ్ సింగ్కు రాసిన లేఖలో ‘మీకు విద్యార్థి రాజకీయాలలో అపారమైన రాజకీయ అనుభవం ఉంది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ పదవీకాలంలో మధ్యప్రదేశ్ అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. మీరు రాష్ట్రంలో సానుకూల అభివృద్ధిని తీసుకువచ్చారు. మహిళలు, పిల్లలు, యువత సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేశారు. ప్రజలు మిమ్మల్ని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారు. మిమ్మల్ని ‘మామాజీ’ అని పిలుస్తూ, గౌరవిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయి.సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తులను వృద్ధి చేయడం, ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం నూతన మార్గాలు ఏర్పాటు చేయడం లాంటి పనులు చేపట్టారు. వ్యవసాయంలో స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేశారు. విదిశ నుండి మీరు వరుసగా ఐదు సార్లు ఎన్నిక కావడం అనేది ప్రజలకు సేవ చేయాలనే మీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. త్వరలో మీరు పార్లమెంటుకు చేరుకుంటారని, కొత్త ప్రభుత్వంలో మనమందరం కలిసి దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి అన్ని విధాలా కృషి చేస్తామని నేను నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు. -
పోలీసుల కళ్లెదుటే ‘మణిపూర్ ఘోరం’
మణిపుర్లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.కాంగ్పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు అయింది.ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది. -
ఆ స్థానానికి ఓటింగ్ తేదీలో మార్పు.. ఆరో దశలో ఎన్నికలు!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్-రాజౌరీ స్థానానికి ఓటింగ్ తేదీ మారింది. అలాగే మూడో దశలో కాకుండా ఆరో దశలో (మే 25) ఓటింగ్ జరగనుంది. గతంలో ఇక్కడ మే 7న ఓటింగ్ నిర్వహించాలనుకున్నారు.అనంతనాగ్-రాజౌరీ స్థానానికి ఓటింగ్ తేదీని వాయిదా వేయాలని బీజేపీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ), జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీలు ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాయి. ఇటీవల కురిసిన మంచు, కొండచరియలు విరిగిపడటమే దీనికి కారణమని సమాచారం. మంచు కురియడానికి తోడు, కొండచరియలు విరిగిపడటం వలన అనంతనాగ్- రాజౌరిలను కలిపే మొఘల్ రహదారిని బ్లాక్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం కొనసాగడం లేదని, దీనికితోడు ఓట్ల శాతం కూడా తగ్గే అవకాశం ఉందని పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.ఈ నేపధ్యంలోనే అందిన వినతి మేరకు ఎన్నికల సంఘం ఓటింగ్ తేదీలో మార్పులు చేసింది. ఈ స్థానంలో ఇప్పటికే నామినేషన్ల దాఖలు సహా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. కాగా జమ్ముకశ్మీర్లోని రాంబన్, బనిహాల్లో భారీ వర్షాలు కురవడానికి తోడు కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. మరొకరు కాలువలో కొట్టుకుపోయారు. వర్షాల కారణంగా 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్, బనిహాల్ మధ్య అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రహదానికి అధికారులు మూసివేశారు. -
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
బెంగళూరు: లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ను జేడీఎస్ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మంగళవారం హుబ్బళిలో జేడీఎస్ కోర్ కమిటీ భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు ప్రజ్వల్ సస్పెన్షన్పై సిఫార్సుచేసిన కొద్ది సేపటికే పార్టీ ప్రజ్వల్ను సస్పెండ్చేసింది. ‘‘ మహిళలను ప్రజ్వల్ లైంగికంగా వేధిస్తున్నట్లు సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఆ వీడియోలు పార్టీకి, పార్టీ నాయకత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయి. పార్టీ నియమావళి, క్రమశిక్షణా నిబంధనావళిని ఉల్లంఘించిన కారణంగా తక్షణం ఆయన్ను సస్పెండ్చేస్తున్నాం’ అని సస్పెన్షన్ ఉత్తర్వులో పార్టీ పేర్కొంది. కోర్ కమిటీ భేటీలో కర్ణాటక రాష్ట్ర జేడీఎస్ చీఫ్ హెచ్డీ కుమారస్వామి కూడా పాల్గొన్నారు. ‘‘ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం నియమించిన సిట్ నివేదిక, ప్రభుత్వ చర్యలను బట్టి సస్పెన్షన్ను పొడిగిస్తామని కుమారస్వామి చెప్పారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
నేను లేక.. మీరుండలేరు..!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
Advertisement