భారత జట్టులో అజయ్‌దేవ్‌ | Ajaydev in Indian Under 19 Cricket Team | Sakshi
Sakshi News home page

భారత జట్టులో అజయ్‌దేవ్‌

Jun 8 2018 10:02 AM | Updated on Jun 8 2018 10:02 AM

Ajaydev in Indian Under 19 Cricket Team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీలంకతో జరగబోయే అండర్‌–19 వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్‌ ప్లేయర్‌ అజయ్‌దేవ్‌ గౌడ్‌ ఎంపికయ్యాడు. బెంగళూరులో గురువారం సమావేశమైన అఖిల భారత జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ అండర్‌–19 వన్డే, నాలుగు రోజుల మ్యాచ్‌ జట్లను ప్రకటించింది. 2017–18 సీజన్‌ జాతీయ అండర్‌–19 టోర్నీ కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో అజయ్‌ మీడియం పేస్‌ బౌలింగ్‌తో 33 వికెట్లు పడగొట్టాడు.

వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఆర్యన్‌ జుయాల్‌ (యూపీసీఏ), నాలుగు రోజుల మ్యాచ్‌ జట్టుకు అనూజ్‌ రావత్‌ (డీడీసీఏ) సారథిగా ఎంపికయ్యారు. డబ్ల్యూవీ రామన్‌ ఈ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. జూలై 11 నుంచి ఆగస్టు 11 వరకు శ్రీలంకలో అండర్‌–19 భారత జట్లు పర్యటిస్తాయి. ఈ పర్యటనలో 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు, 5 వన్డే మ్యాచ్‌లు ఆడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement