
సాక్షి, పెడన : వైఎస్స్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ 154వ రోజు పాదయాత్ర షెడ్యూలు విడుదలైంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పెడన నియోజకవర్గంలోని కొంకెపూడి శివారు నుంచి ఆదివారం ఉదయం రాజన్న బిడ్డ పాదయాత్రను ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, వేమవరం, కవుతారం మీదుగా గుడ్లవల్లేరు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. అడుగడునా జననేతకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.