
సాక్షి, గుడివాడ : వైఎస్స్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 155వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి సోమవారం ఉదయం వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అంగలూరు మీదుగా బొమ్మలురు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45 ప్రారంభమౌతుంది.
అనంతరం పాదయాత్ర గుడివాడ వరకూ కొనసాగుతుంది. గుడివాడలోని నెహ్రూ చౌక్ సెంటర్లో జరగనున్న బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రికి రాజన్న బిడ్డ ఇక్కడే బస చేస్తారు.