
సాక్షి, గుడివాడ : వైఎస్స్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 156వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుడివాడ నుంచి మంగళవారం ఉదయం వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మల్లయ్య పాలెం క్రాస్ రోడ్డు, చౌటపల్లి, పెద పాలపర్రు మీదుగా కల్వపుడి అగ్రహారం క్రాస్ రోడ్డు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభంకానుంది. అక్కడి నుంచి కోడురు క్రాస్ రోడ్డు, చిన్న పాలపర్రు క్రాస్ రోడ్డు మీదుగా ముదినేపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వైఎస్ జగన్ ఇక్కడే బస చేస్తారు.
ముగిసిన పాదయాత్ర
జననేత వైఎస్ జగన్ 155వ రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. సోమవారం వైఎస్ జగన్ పాదయాత్ర గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి అంగలూరు, బొమ్మలురు మీదుగా గుడివాడ వరకు కొనసాగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు.