మీరు కుప్పంలో చేసిందేంటి బాబూ?

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి:  కోవిడ్‌–19 విజంభణతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద మానవ సంక్షోభమే వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాలే కాకుండా నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ పనిని వైఎస్సార్‌ సీపీ చేస్తుంటే చంద్రబాబు రోజూ దుమ్మెత్తిపోస్తున్నాడని మండిపడ్డారు.

ఇటీవల చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కుప్పంలో భౌతికదూరం పాటించకుండా టీడీపీ నేతలు ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేసిన ఫొటోలను సజ్జల ఈ సందర్భంగా ట్విట్టర్‌లో పొందుపరుస్తూ.. నీ పుట్టిన రోజు వేడుకలకు చేసింది ఏమిటి? దీని వల్ల కరోనా వ్యాప్తి చెందదా చంద్రబాబు? అంటూ ట్వీట్‌ చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top