‘ప్రజల సొమ్ముతో బాబు సోకులు పడుతున్నాడు’

Pydikondala Manikyala Rao Fires On Chandrababu Naidu Over Modi Visit To AP - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తూ.. మోదీ సభను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ మాజీ ఎంపీ పైడికొండల మాణిక్యాల రావు ధ్వజమెత్తారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా, రాష్ట్రవ్యాప్తంగా ‘నో ఎంట్రీ మోదీ’, ‘గో బ్యాక్‌ మోదీ’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ సభను అడ్డుకోవడానికి చంద్రబాబు ఆర్టీసీ, ఆటో యూనియన్లను వాడుకుంటున్నారని ఆరోపించారు.

ఈ నెల 11న ఢిల్లీలో చంద్రబాబు చేయబోయే ధర్మపోరాట దీక్షకు జనాలను తరలించడానికి.. ఇప్పటికే రెండు రైళ్లకు రూ.1.12 కోట్లు మంజూరు చేశారని మండిపడ్డారు. ప్రజా ధనంతో ఆర్టీసీ ద్వారా 7 నక్షత్రాల బస్సు కొనిపించుకున్న చంద్రబాబు.. సామన్య బస్సుగా ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టార్జితంతో చంద్రబాబు సోకులు పడుతున్నారంటూ విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top