టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై పొన్నం ఫైర్‌ | ponnam prabhakar fire on trs sarkar | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై పొన్నం ఫైర్‌

Jan 28 2018 12:31 PM | Updated on Mar 18 2019 9:02 PM

ponnam prabhakar fire on trs sarkar - Sakshi

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్ : టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ..రైతులకు 24 గంటల కరెంట్ కావాలని ఎవరు అడిగారని..ఇప్పుడు 12 గంటల కరెంటు చాలని ఎవరు తీర్మానం చేయమన్నారని టీఆర్‌ఎస్‌ నేతలనుద్దేశించి ప్రశ్నించారు. జడ్పీలో తీర్మానం ప్రభుత్వ అనాలోచిత విధానాలకు నిదర్శనమన్నారు.

 రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రి ఈటల రాజేందర్‌ తీర్మానం చేయమనడం ఏం సూచిస్తుందని అడిగారు. నిధులు, విధుల విషయంలో చర్చించకుండా, ప్రజాసమస్యలపై చర్చించకుండా మొక్కుబడి సమావేశం నిర్వహించారని మండిపడ్డారు.  సోషల్ మీడియాలో విమర్శిస్తే కేసులు పెడతామంటే భయపడమని చెప్పారు. కేసీఆర్ దొంగ, అవినీతిపరుడని తప్పకుండా విమర్శిస్తామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement