ఆకట్టుకుంటున్న శక్తి పోలింగ్‌ స్టేషన్‌

Poling Station Arranged Like Marriage Ceremony In Andole - Sakshi

సాక్షి, జోగిపేట(అందోల్‌): అందోలులోని ఉన్నత పాఠశాలలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బుధవారం శక్తి పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి ఒక్కటి శక్తి పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు ఉండటంతో అందోలులో ఏర్పాటు చేసినట్లు అందోలు తహసీల్దార్‌ బాల్‌రెడ్డి తెలిపారు. ఈ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే దారిని అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక కర్టెన్‌లతో స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. వివాహ వేడుకలాగా ఏర్పాటు చేసిన స్వాగతతోరణం బాగా ఆకట్టుకుంటుంది. గ్రామస్తులు ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని చూసి వెళ్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జోగిపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో శక్తి పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top