హైదరాబాద్‌లో బట్టబయలైన పరిటాల నిర్వాకం | Paritala Aide Caught With Money In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో బట్టబయలైన పరిటాల నిర్వాకం

Apr 2 2019 9:27 AM | Updated on Apr 2 2019 9:58 AM

Paritala Aide Caught With Money In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అనంతపురం: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలు బరితెగింపులకు దిగుతున్నారు. రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను గట్టెక్కించేందుకు ప్రలోభాలకు తెరతీశారు. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు ఆరు వేల రూపాయలు పంచుతున్నట్టు ప్రచారం జరగుతోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో పరిటాల సునీత నిర్వాకం బట్టబయలైంది. నగరంలోని అరాంఘర్‌ చౌరస్తా వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పరిటాల వర్గీయుడి నుంచి పోలీసులు 24లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సునీత ముఖ్య అనుచరుడు రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్‌ డ్రైవర్‌ సంతోష్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement