రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించటానికి.. తెగుళ్ల నియంత్రణ, నేల/మొక్కల ఆరోగ్య నిర్వహణ కోసం రసాయనేతర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటానికి హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్ఐపీహెచ్ఎం) వివిధ తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతికతలు, ఉత్పాదకాలను అభివృద్ధి చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఈ సంస్థ ఏర్పాటైంది.
దేశంలో సేంద్రియ / ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటంలో భాగంగా రైతులకు నాణ్యమైన జీవన ఎరువులు, ద్రావణాలు, కషాయాలు వంటి జీవ ఉత్పాదకాలను అందించే జీవ వనరుల కేంద్రాల (బీఆర్సీల) స్థాపనపై సంపూర్ణ అవగాహన కలిగించటానికి ఎన్ఐపీహెచ్ఎం ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనుంది.
తక్కువ ఖర్చుతో కూడిన జీవ ఉత్పాదకాలు, వాటి ఉత్పత్తి సాంకేతికతల గురించి అవగాహన కలిగిస్తారు. ప్రగతిశీల రైతులు, ఎఫ్పీఓలు / స్వయం సహాయక బృందాలు/ కృషి సఖిలు, విస్తరణ అధికారులు, సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామీణ యువ పారిశ్రామికవేత్తలు ఈ శిక్షణ పొందడానికి అర్హులు. ఫీజు, భోజన, వసతి సదుపాయాల వివరాల కోసం ఎన్ఐపీహెచ్ఎం వెబ్సైట్ చూడొచ్చు లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు:
dirphmniphm-ap@nic.in - damodar.kammari@gov.in


