బిల్డ్‌ ఏపీ కాదు సోల్డ్‌ ఏపీ | Nara Chandrababu Naidu Critics On BJP | Sakshi
Sakshi News home page

బిల్డ్‌ ఏపీ కాదు సోల్డ్‌ ఏపీ

May 15 2020 4:34 AM | Updated on May 15 2020 4:34 AM

Nara Chandrababu Naidu Critics On BJP - Sakshi

సాక్షి, అమరావతి: విలువైన భూములను కారుచౌకగా వైఎస్సార్‌సీపీ మాఫియాకు కట్టబెట్టేందుకే బిల్డ్‌ ఏపీ పేరుతో సోల్డ్‌ ఏపీ చేపట్టారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి గురువారం ఏపీలోని టీడీపీ సీనియర్‌ నేతలతో ఆయన ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే..  
► ప్రజల ఆస్తులకు ప్రభుత్వాలు ట్రస్టీలుగా ఉండాలి. ఏడాదిగా రాష్ట్రంలో నెలకొన్న దుష్పరిణామాలు, కరోనా సంక్షోభం కారణంగా భూముల ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఆస్తుల అమ్మకం అవివేకం.   
► ఫిబ్రవరిలో వచ్చిన కరెంటు బిల్లులే ప్రతినెలా వసూలు చేయాలి. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి, ఆదాయాలు పడిపోయిన నేపథ్యంలో సామాన్యులపై కరెంటు బిల్లులు మూడు నాలుగు రెట్లు వసూలు చేయడం గర్హనీయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement