గవర్నర్‌ను కలిసిన యడ్యూరప్ప బృందం | Karnataka Governor Allows BJP To Prove Majority In The Assembly | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన యడ్యూరప్ప బృందం

May 15 2018 5:52 PM | Updated on May 16 2018 6:55 PM

Karnataka Governor Allows BJP To Prove Majority In The Assembly - Sakshi

సాక్షి, బెంగళూరు: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కర్ణాటక గవర్నర్‌ వజుభాయ్‌ రుడాభాయ్‌ వాలా నిర్ణయం కీలకంగా మారింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చిన బీజేపీ అభ్యర్థనను గవర్నర్‌ స్వీకరించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం మాత్రం పలకకపోవడం గమనార్హం. గవర్నర్‌తో భేటీ అనంతరం బయటికొచ్చిన యడ్యూరప్ప బృందం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏడు రోజుల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్‌ సూచించారు. నూటికి నూరు శాతం బలాన్ని నిరూపించుకుంటాం’’ అని చెప్పారు. యడ్యూరప్పతోకలిసి గవర్నర్‌ను కలిసిన వారిలో కేంద్ర మంత్రి అనంతకుమార్‌, బీజేపీ నేతలు శ్రీరాములు తదితరులు ఉన్నారు. తొలుత బీజేపీ నేతలను కలిసిన గవర్నర్‌.. తర్వాత జేడీఎస్‌-కాంగ్రెస్‌ నేతలకు టైమిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement