
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు గుర్తించారు. రాహుల్ కూడా తన నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాహుల్గాంధీ మాదిరిగానే సమర్ధుడని అన్నారు. రాహుల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిండాన్ని బయటి వ్యక్తులు నిర్ణయించడం (జడ్జ్) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లవుతుందని అన్నారు. రాహుల్ మంచి యువకుడని, మార్పుకు అనుగుణంగా స్పందించగలవారని, దేనినైనా తనలో ఇముడ్చుకునే స్వభావం ఉన్నవారని, సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు.
ప్రస్తుతం రాహుల్గాంధీ పరిస్థితిని ఒకప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులతో ఆయన పోల్చారు. 'నాయకుడు ముందే తయారు చేయరు. ఇందిరాగాంధీని మేడమ్ టుస్సాడ్ విగ్రహం మాదిరిగా ఎవరో తయారుచేసి పెట్టలేదు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆమె నాయకత్వ ప్రతిభ ద్వారా ఎదిగారు. మంచి నాయకురాలు అయ్యారు. అలాగే రాజీవ్గాంధీ కూడా' అని రాహుల్ పరిస్థితిని పోల్చారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్గాంధీ అధ్యక్షుడు అవుతారా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుంటుంది. కాంగ్రెస్ కానిస్టిట్యూషన్ ఇప్పటిది కాదు. కాంగ్రెస్ పార్టీ డెలిగేట్స్ అంతా కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అంత అంతర్గత వ్యవహారం' అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.