కర్నూలు (ఓల్డ్సిటీ): కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ను ప్రకటించారు. కర్నూలులోని రాయల్ ఫంక్షన్ హాలులో బుధవారం సాయం త్రం కర్నూలు నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ మేకపాటి గౌతంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయన హఫీజ్ ఖాన్ను అభ్యర్థిగా ప్రకటించారు.