‘2017లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది’

Democracy was humiliated in 2017 says Botsa - Sakshi

సాక్షి, విశాఖపట్టణం : 2017లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రి మండలికి ఒక ఔన్నత్యం ఉందని, అలాంటి పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం కంటే దారుణం మరొకటి లేదని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top