రాజ్యసభలో మళ్లీ దుమారం | Congress protests PM Modi's remarks against Manmohan Singh | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో మళ్లీ దుమారం

Dec 20 2017 2:29 PM | Updated on Aug 21 2018 2:39 PM

 Congress protests PM Modi's remarks against Manmohan Singh - Sakshi

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై బుధవారం కూడా రాజ్యసభలో దుమారం కొనసాగింది.

సాక్షి, న్యూఢిల్లీ:  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై బుధవారం కూడా రాజ్యసభలో దుమారం కొనసాగింది. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో మనోహ్మన్‌ పాకిస్థాన్‌ నేతలతో కలిసి కుట్ర పన్నారంటూ ప్రధాని చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్‌ మోదీ క్షమాపణ చెప్పాలంటూ మూడు రోజులుగా సభలో పట్టుబడుతోంది.

ఈ క్రమంలో బుధవారం సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశాన్ని లేవనెత్తారు. సభలో మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని బీజేపీ తేల్చిచెప్పింది. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళనతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement