‘అభివృద్థికి పట్టం కట్టారు’  | up cm yogi on up civic poll results | Sakshi
Sakshi News home page

‘అభివృద్థికి పట్టం కట్టారు’ 

Dec 1 2017 3:36 PM | Updated on Aug 25 2018 4:19 PM

up cm yogi on up civic poll results - Sakshi

సాక్షి,లక్నో: యూపీ స్ధానిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం ప్రజలకు తమపై ఉన్న విశ్వాసానికి సంకేతమని సీఎం యోగి ఆదిత్యానాథ​ అన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేందుకు ఈ ఫలితాలు నిదర్శనమని చెప్పారు.బీజేపీకి అనుకూలంగా ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు.అమేథి, బరేలీ వంటి కాంగ్రెస్‌ కంచుకోటల్లో బీజేపీ అభ్యర్థుల విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

రాష్ట్రంలోని 16 మేయర్‌ స్థానాలకు గాను బీజేపీ 12 మేయర్‌ స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్‌పీ రెండు మేయర్‌ స్థానాలను గెలుచుకుంది. మరోవైపు అమేథి సహా పలు నగరపంచాయితీల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. 

Advertisement
 
Advertisement
Advertisement