
బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి
సాక్షి, తిరుపతి: పార్టీలను ప్రశ్నించే హక్కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి అన్నారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబే పాలనంతా అవినీతి మయమేనని విమర్శించారు.
పోలవరంలో ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచారని.. ఈ అంశంపై కేంద్రం ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. పట్టిసీమలో రూ. వందల కోట్ల అవినీతి జరిగిందని, టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా దోచుకున్నారని మండిపడ్డారు. అవినీతిని ప్రశ్నించినందుకే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.