వెలుగులు జిమ్మే దీపావళి రానే వచ్చింది. శుక్రవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. పండుగ సామగ్రి కొనుగోలుకు జనం మార్కెట్లకు తరలివచ్చారు. ధరల మోత మోగినా బాణసంచా వ్యాపారం జోరుగా సాగింది. ప్రజలకు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, బీజేపీ జాతీయనేత వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.