జీసీటీఏ ఆధ్వర్యంలో ఉచిత సెమినార్‌

Will, Trust and Estate Planning Seminar by Attorney Mr. Paul R. Revelson - Sakshi

సిన్సినాటి(ఒహియో, అమెరికా) : సామాజిక అవగాహన ప్రచారంలో భాగంగా గ్రేటర్‌ సిన్సినాటి తెలంగాణ అసోసియేషన్‌ (జీసీటీఏ) ఉచితంగా సెమినార్‌ను ఏర్పాటు చేసింది. అటార్నీ పాల్‌ రివల్సన్‌ ఆధ్వర్యంలో విల్‌, ఎస్టేట్‌ అండ్‌ ట్రస్ట్‌ ప్లానింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జీసీటీఏ ఓ ప్రకటనలో తెలిపింది. కమ్యునిటీకి చెందిన సీనియర్‌ సిటిజన్‌ సత్య మాజేటి కూడా ఈ అంశంపై తన అనుభవాలను పంచుకోనున్నారు. రవీస్‌ హైదరాబాద్‌ హౌస్‌, 9536 సిన్సినాటి కోలంబస్‌ రోడ్‌లో ఏప్రిల్‌ 29న మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా  ఈవెంట్‌ కో ఆర్డినేటర్‌లు సీతారాం బోయిన పల్లి, గణేష్‌ కోటలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top